ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథుల ఖరారు

By

Published : Aug 13, 2020, 5:58 AM IST

స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ముఖ్య అతిథులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ కృష్ణా జిల్లాలో జెండా వందనం చేయనున్నారు.

independence day celebrations
independence day celebrations

స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ముఖ్య అతిథులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయిలో జరిగే పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం జగన్​ కృష్ణా జిల్లాలో జెండా వందనం చేస్తారని సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

జిల్లా ముఖ్య అతిథి(మంత్రి)
శ్రీకాకుళం కొడాలి నాని
విజయనగరం వెల్లంపల్లి శ్రీనివాసరావు
విశాఖపట్నం కన్నబాబు
తూర్పుగోదావరి ధర్మాన కృష్ణ దాస్
పశ్చిమగోదావరి పేర్ని నాని
గుంటూరు చెరుకువాడ శ్రీరంగనాథరాజు
ప్రకాశం బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి
నెల్లూరు బాలినేని శ్రీనివాస రెడ్డి
కర్నూలు అనిల్ కుమార్
కడప ఆదిమూలపు సురేశ్‌
అనంతపురం బొత్స సత్యనారాయణ
చిత్తూరు మేకపాటి గౌతమ్ రెడ్డి

ఈ మేరకు ప్రొటోకాల్ ఏర్పాట్లు చేయాల్సిందిగా సాధారణ పరిపాలనా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details