తెలంగాణ నుంచి విజయవాడ, గుంటూరు రెడ్జోన్ ప్రాంతంలో అక్రమంగా మద్యం విక్రయించే ముఠాను భవానీపురం పోలీసులు పట్టుకున్నారు. కారులో తరలిస్తున్న 300 క్వార్టర్ బాటిళ్ళతో పాటుగా కారును స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశామని భవానీపురం సిఐ మోహన్ రెడ్డి తెలిపారు. మద్యం అక్రమ రవాణా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం
రాష్ట్రంలోకి అక్రమంగా తెలంగాణ మద్యం సీసాలను తరలిస్తున్న వ్యక్తిని భవానీపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు విజయవాడ, గుంటూరు రెడ్ జోన్ ప్రాంతంలో మద్యం విక్రయించేందుకు తరలిస్తుండగా పట్టుకున్నారు.
విజయవాడ గుంటూరు రెడ్ జోన్ ప్రాంతంలో తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం