ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 31, 2020, 11:03 PM IST

ETV Bharat / state

గ్రామ సచివాలయంలో.. పుట్టినరోజు వేడుకా?

కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాల్సిన సిబ్బందే ఆ నిబంధనలు పాటించటం లేదు. గ్రామ సచివాలయ కార్యాలయాన్ని పుట్టినరోజు వేదికగా మార్చి పార్టీ చేసుకున్నారా వాలంటీర్లు.

birthday celebrations in grama sachivalyam
గ్రామ సచివాలయమాయే పుట్టినరోజు వేదిక!

గ్రామ సచివాలయమాయే పుట్టినరోజు వేదిక!

విజయవాడ నగర శివారు పాయికాపురం ఉడా కాలనీలోని వార్డు నెంబర్ 278 సచివాలయంలో వాలంటీర్లు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. రాత్రి సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించడమే కాక.. లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండా, కరోనా వైరస్ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పార్టీ చేసుకున్నారు.

వారి తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ సిబ్బంది ఐదుగురు యువకులు, ఇద్దరు మహిళా ఉద్యోగులు, సచివాలయ సెక్రటరీ ఈ పార్టీలో పాల్గొన్నారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించాల్సిన వీర.. ఇలా ప్రవర్తించడంపై స్థానికులు మండిపడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details