రాష్ట్రంలో మత్స్యకారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా నిర్మించ తలపెట్టిన ఫిషింగ్ హార్బర్లపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 8 ఫిషింగ్ హార్బర్లు, ఒకచోట ఫిష్ ల్యాండ్ నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. శ్రీకాకుళంలో రెండు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మించాలని సర్కారు ఆదేశాలిచ్చింది.
ఫిషింగ్ హార్బర్లు నిర్మించే ప్రాంతాలు
శ్రీకాకుళం | మంచినీళ్లపేట | ఫిష్ ల్యాండ్ |
శ్రీకాకుళం | బడగట్లపాలెం | మేజర్ ఫిషింగ్ హార్బర్ |
విశాఖ | పూడిమడక | మేజర్ ఫిషింగ్ హార్బర్ |
తూర్పుగోదావరి | ఉప్పాడ | మేజర్ ఫిషింగ్ హార్బర్ |
పశ్చిమగోదావరి | నర్సాపురం | మేజర్ ఫిషింగ్ హార్బర్ |
కృష్ణా | మచిలీపట్నం | మేజర్ ఫిషింగ్ హార్బర్ |
గుంటూరు | నిజాంపట్నం | మేజర్ ఫిషింగ్ హార్బర్ |
ప్రకాశం | కొత్తపట్నం | మేజర్ ఫిషింగ్ హార్బర్ |
నెల్లూరు | జువ్వలదిన్నె | మేజర్ ఫిషింగ్ హార్బర్ |
మత్స్యకారులు వలస పోకూడదు...