ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 4, 2020, 7:02 PM IST

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 186 మద్యం సీసాలు స్వాధీనం

రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగడంతో కృష్ణా జిల్లాలో కొందరు అక్రమ మద్యం సరఫరాకు తెరతీశారు. తెలంగాణ రాష్ట్రంలోని మధిర నుంచి తరలిస్తున్న మద్యాన్ని జొన్నలగడ్డ చెక్​పోస్ట్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

186 bottles of illicit liquor seized in Jonnalagadda chekpost in krishna district
అక్రమంగా తరలిస్తున్న 186 మద్యం సీసాలు స్వాధీనం

తెలంగాణ రాష్ట్రంలోని మధిర నుంచి ఆటోలో తరలిస్తున్న 186 మద్యం సీసాలను కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ వద్ద పోలీసులు పట్టుకున్నారు. చెక్​పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ మద్యం బయటపడింది. మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details