'రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'
రాష్ట్రంలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చిన నేత సీఎం జగన్ అని హోంమంత్రి మేకతోటి సుచరిత కొనియాడారు. గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సుచరిత హాజరై మాట్లాడారు.
గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిన నేత సీఎం జగన్ కొనియాడారు. గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మేది వైకాపా ప్రభుత్వమని పేర్కొన్నారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణం స్వీకారం చేయించారు.