ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 30, 2021, 3:58 PM IST

ETV Bharat / state

'ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారు'

ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. డబ్బులిస్తూనే పన్నుల రూపంలో గుంజుకుంటున్నారని ఆరోపంచారు. బెదిరింపు రాజకీయాలకు ఆనవాలుగా వైకాపా ప్రభుత్వం ఉందని దివ్యవాణి విమర్శించారు.

tdp leader divya vani comments on ysrcp government
tdp leader divya vani comments on ysrcp government

అమ్మఒడి పథకం ద్వారా ఎడాదికి ఒకసారి 14 వేల రూపాయలిస్తున్న ప్రభుత్వం.. ప్రతి నెలా పన్నుల రూపంలో ప్రజల నుంచి అంతే మొత్తం గుంజుకుంటోందని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ నిత్యవసరాల ధరలు పెంచేశారని ఆరోపించారు. రేషన్‌ పంపిణీ పేరుతో కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. బెదిరింపు రాజకీయాలకు ఆనవాలుగా వైకాపా ప్రభుత్వం ఉందని దివ్వవాణి అన్నారు.

వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత దివ్యవాణి వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details