ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 20, 2021, 12:38 PM IST

ETV Bharat / state

కొవిడ్​తో దుగ్గిరాలలో ఆర్ఎంపీ మస్తాన్ వలి మృతి

దుగ్గిరాలకు చెందిన ఆర్​ఎంపీ మస్తాన్ వలి కొవిడ్​తో మృతి చెందారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ.. తుది శ్వాస విడిచారు.

RMP doctor Mustan Vali dead
ఆర్.ఎం.పి వైద్యులు మస్తాన్ వలి మృతి

గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన ఆర్​ఎంపీ మస్తాన్ వలి కొవిడ్​తో మరణించారు. పది రోజుల క్రితం ఆయనకు జ్వరం రావటంతో.. కరోనా పరీక్ష చేయించారు. ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావటంతో.. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. రాత్రి శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడటంతో.. వైద్యులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. మస్తాన్ వలి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన భాజపా మైనార్టీ మోర్చాలో రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

covid

ABOUT THE AUTHOR

...view details