ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాజధానిపై రెఫరెండానికి ప్రభుత్వం సిద్ధమా?'

By

Published : Jan 9, 2020, 7:38 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందుగా.. ప్రభుత్వం రాజధాని అంశంపై రెఫరెండం పెట్టాలని మాజీ మంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. నిరసనకారులను అరెస్టు చేసి.. వారి ఆచూకీ తెలపడం లేదని ఆగ్రహించారు.

prattiopati pullarao
ప్రత్తిపాటి పుల్లరావు

ప్రత్తిపాటి పుల్లరావు మీడియా సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ముందుగా... ప్రభుత్వం రాజధాని అంశంపై రెఫరెండం పెట్టాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు సవాల్ విసిరారు. స్వతంత్ర భారతంలో పోలీసులతో పాలన నడుపుతున్నారంటూ.. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తీరును గుంటూరులో విమర్శించారు. పోలీసులు లేకుండా సీఎం బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారన్న ఆయన... ఒక స్టేషన్‌ పరిధిలో ఘటన జరిగితే వారిని ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారని ఆక్షేపించారు. నిరసనల్లో అరెస్టు చేసిన వారి ఆచూకీ కూడా తెలియనివ్వటం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు మంచివి కాదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details