ఈ-వేలం టెండర్లు ఖరారు చేయకూడదని హైకోర్టు ఆదేశాలు
గుంటూరు ప్రధాన కూడలిలోని పి.వి.కె నాయుడు మార్కెట్ స్థల అమ్మకాన్ని నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వేలం టెండర్లు ఖరారు చేయకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు పిటిషనర్ పేర్కొన్నారు.
పి.వి.కె నాయుడు మార్కెట్ ఈ వేలం నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్
గుంటూరు పి.వి.కె నాయుడు కూరగాయల మార్కెట్ ఈ వేలం నిలిపివేయాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. పి.వి.కె నాయుడు వారసురాలు చంద్రిక తరుపున హైకోర్టు న్యాయవాది జస్టిస్ బి.నలిన్ కుమార్ పిటిషన్ వేశారు. ఈ వేలం టెండర్లు ఖరారు చేయకూడదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు చంద్రిక వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భూములు అమ్మకానికి వీలు లేదని న్యాయస్థానం అభిప్రాయపడిందన్నారు. ఆర్టికల్ 266 ప్రకారం ఈ టెండర్ ప్రక్రియ పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.