ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 18, 2021, 9:33 PM IST

ETV Bharat / state

'మున్సిపల్​ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్​ విడుదల చేయాలి'

మున్సిపల్​ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్​ విడుదల చేయాలని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్​ వలీ డిమాండ్​ చేశారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

PCC Executive President Mastan Vali
పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్​ వలి

పురపాలక ఎన్నికలకు.. తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్​ వలీ డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించి... ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రక్రియ నిలిచిపోయిన చోట నుంచే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్​ఈసీ చెప్పటం దారుణమన్నారు.

ఎస్​ఈసీ నిర్ణయం వల్ల మున్సిపాలిటీల్లోని ఇరవై లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వానికి భయపడి ఎన్నికలు పెడుతున్నారా.. లేక ఏదైనా ఒప్పందం పెట్టుకొని నిర్వహిస్తున్నారా అన్నది ఎన్నికల కమిషనర్​ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details