ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనుమానాలు ఉంటే అతిథి గృహానికి రావాలా.... నాగార్జున వర్శిటీ వీసీపై విద్యార్థుల ఆగ్రహం

By

Published : Feb 6, 2020, 7:21 PM IST

విద్యార్థినిపై నాగార్జున వర్శిటీ వీసీ బుధవారం వ్యవహరించిన తీరుపై విద్యార్థి సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశాయి.

nagarjuna university students protest
నాగార్జున వర్శిటీలో విద్యార్థుల ధర్నా

విద్యార్థిని అతిథి గృహానికి రమ్మన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ఉపకులపతి​పై దిశ, నిర్భయ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి. మూడు రాజధానులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన సదస్సులో సందేహాలు అడిగినందుకు విద్యార్థిని స్టేజిపై నుంచి కిందకి నెట్టేశారని... అనుమానాలుంటే అతిథిగృహానికి రావాలని ఆమెను అన్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. ఆయనపై ఉన్న అవినీతి మరకలను తొలగించుకునేందుకు వైకాపాకు మద్దతుగా విశ్వవిద్యాలయంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు చెప్పారు. ఈ విషయాన్ని గవర్నర్​ దృష్టికి తీసుకెళ్తామని నేతలు స్పష్టం చేశారు.

నాగార్జున వర్శిటీలో విద్యార్థుల ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details