ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 8, 2019, 6:46 AM IST

ETV Bharat / state

నిమ్మ రైతుల సమస్య పరిష్కారానికి కృషిచేస్తా: మోపిదేవి

తెనాలి నిమ్మ మార్కెట్​లో ఈ నామ్ పెట్టొద్దని మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​తో కలిసి రైతులు వినతి పత్రం ఇచ్చారు.

మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

తెనాలిలో నిమ్మ రైతులు మంత్రి మోపిదేవి వెంకటరమణను కలిశారు. నిమ్మ మార్కెట్​లో ఈనామ్ పెట్టొద్దని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ... రైతుల సమస్యల గురించి అధికారులతో చర్చించి పరిష్కారం చూపుతామని హామీఇచ్చారు. స్థానిక నేతలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి త్వరలో రైతులతో కమిటీ వేస్తామని చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ నామ్ విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

ABOUT THE AUTHOR

...view details