ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 5, 2020, 8:41 PM IST

ETV Bharat / state

'కరోనాను కట్టడిలో ప్రభుత్వం విఫలం'

మద్యం దుకాణాలను ప్రారంభించి కరోనా వ్యాప్తికి వైకాపా ప్రభుత్వం గేట్లు తెరిచిందని... గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

'కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం'
'కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం'

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించకుండా మద్యం షాపులు తెరవటం సిగ్గుచేటన్నారు. మద్యం తాగే వారి బలహీనతను అడ్డుపెట్టుకుని పేదలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. మద్యం రేట్లను ఇష్టానుసారంగా పెంచి పేదవారి పొట్టకొడుతున్నారని జీవీ ఆరోపించారు.

మద్యం దుకాణాలు ప్రారంభించి కరోనా వ్యాప్తికి వైకాపా ప్రభుత్వం గేట్లు తెరిచిందని ధ్వజమెత్తారు. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద క్యూలైన్లు నివారించడానికి వాడుకోవడం హేయమైన చర్యని దుయ్యబట్టారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేయటంపైన ఉన్న శ్రద్ధ... కరోనా వైరస్​ను నివారించటంలో ఉంటే బాగుండేదని హితువు పలికారు.

ABOUT THE AUTHOR

...view details