ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 2, 2020, 11:56 AM IST

ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బాటిళ్లు తరలింపు... ఇద్దరి అరెస్ట్​​

ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి 100 మద్యం సీసాలు తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను చెరుకుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు పొన్నూరుకు చెందిన వ్యక్తులగా గుర్తించినట్లు ఎస్సై రమేశ్​ తెలిపారు. వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

100 ప్రభుత్వ మద్యం సీసాలు తరలింపు

ప్రభుత్వం మద్యం దుకాణం నుంచి అధిక సంఖ్యలో మద్యం తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలో జరిగింది. రాంభోట్ల వారిపాలెంలోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి 100 మద్యం బాటిళ్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. వీరిద్దరితోపాటు మద్యం అమ్మిన సేల్స్​మెన్​ని అదుపులోకి తీసుకున్నట్లు చెరుకుపల్లి ఎస్సై రమేశ్​​ తెలిపారు. మద్యం దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details