ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pulichintala Gate: ఏడు ఎలిమెంట్లను అమర్చిన నిపుణులు

By

Published : Aug 7, 2021, 8:31 PM IST

పులిచింతల ప్రాజెక్టులో స్టాప్​లాక్ గేటు ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 7 ఎలిమెంట్లను ఇంజినీరింగ్ నిపుణులు అమర్చారు. స్టాప్​లాక్ ఏర్పాటుకు మెుత్తం 11 ఎలిమెంట్లను అమర్చాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ఏడు ఎలిమెంట్లను అమర్చిన నిపుణులు
ఏడు ఎలిమెంట్లను అమర్చిన నిపుణులు

పులిచింతల ప్రాజెక్టులో స్టాప్​లాక్ గేటు ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 7 ఎలిమెంట్లను ఇంజినీరింగ్ నిపుణులు అమర్చారు. స్టాప్​లాక్ ఏర్పాటుకు మెుత్తం 11 ఎలిమెంట్లను అమర్చాల్సి ఉందని అధికారులు తెలిపారు. అయితే చీకటి పడటంతో స్టాప్ లాక్ పనులను నిపుణులు, సిబ్బంది నిలిపివేశారు. మళ్లీ రేపు ఉదయం స్టాప్ లాక్ పనులను ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.

రేపు మధ్యాహ్ననికి మెుత్తం ఎలిమెంట్ల పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. స్టాప్​లాక్ ఏర్పాటు తర్వాత జలాశయంలో నీరు నింపేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం పులిచింతలకు 33 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలో 5.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇదీ చదవండి:

భారత్ భళా- ఒలింపిక్స్​లో అత్యుత్తమ ప్రదర్శన ఇదే..

ABOUT THE AUTHOR

...view details