ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2020, 6:31 PM IST

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్​, సివిల్​ పోలీసులు దాడులు

నిజాంపట్నం మండలంలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్​ పోలీసులు దాడులు చేశారు. 3 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు పడతాయని ఎస్సై హెచ్చరించారు.

excise and civil police rides on cheap liquor places
3 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

నిజాంపట్నం మండలంలో ఎక్సైజ్​, సివిల్​ పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. వీరంకి వారిపాలెం, శొంఠి వారిపాలెం గ్రామాల సమీపంలోని మడ అడవి ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న సుమారు 3 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం, నాటుసారా తయారీ, అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని నగరం, నిజాంపట్నం మండలాల ఎక్సైజ్​ ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు. నాటుసారాను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details