ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాష్ట్రంలో మానవత్వం లేని పాలన సాగుతోంది'

By

Published : Nov 8, 2020, 10:55 PM IST

రాష్ట్రంలో మానవత్వం లేని పరిపాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ నేత దివ్యవాణి విమర్శించారు. వైకాపా పాలన పట్ల ప్రజలు నిరాశ, అసంతృప్తితో ఉన్నారన్నారు.

'రాష్ట్రంలో మానవత్వం లేని పాలన సాగుతోంది'
'రాష్ట్రంలో మానవత్వం లేని పాలన సాగుతోంది'

వైకాపా పాలన పట్ల ప్రజలు నిరాశ, అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశం పార్టీ నేత దివ్యవాణి ఆరోపించారు. రాష్ట్రంలో మానవత్వం లేని పరిపాలన సాగుతోందన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించిన నా ఇల్లు-నా సొంతం ర్యాలీలో పాల్గొన్న ఆమె...వైకాపా పాలనపై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు మంజూరు చేసిన ఇళ్లను ఇప్పటికీ కేటాయించకపోవడం సరికాదన్నారు. ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ప్రజావేదికను కూల్చారని...కట్టేవాడు నాయకుడా ? కూల్చేవాడు నాయకుడా? అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details