ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో 33 మందికి కరోనా

గుంటూరులోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ రాష్ట్ర కార్యాలయంలో 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలో ఉద్యోగులంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఇంకా 30 మంది ఫలితాలు రావాల్సి ఉంది. వాటిల్లో ఎంత మందికి పాజిటివ్ వస్తుందో తెలియాల్సి ఉంది.

By

Published : Jul 6, 2020, 10:04 AM IST

corona in women welafare office in guntur dst
corona in women welafare office in guntur dst

గుంటూరులోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు కార్యాలయంలో ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా 33 మంది ఉద్యోగులకు పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఒక్కసారిగా 33 కేసులు నమోదు కావటంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. అయితే కొద్దిరోజులు పాటు కార్యాలయాన్ని తాత్కాలింగా మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details