మొదటి ఆరు నెలల్లోనే రాష్ట్ర బడ్జెట్ అంచనాలు తారుమారు అయిపోతున్నాయి((ap budget news). ఆదాయం కంటే అప్పులు ఎక్కువై రాష్ట్రం ఇబ్బందుల్లో పడింది. గత ఏడాదితో పోలిస్తే.. గడిచిన ఐదు నెలల కాలంలో అదనపు ఆదాయం వచ్చినప్పటికీ.. చేస్తున్న వ్యయం ఎక్కువ కావడంతో అంచనాలు మారిపోయాయి. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు కూడా రాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి(central grants to ap).
వేధిస్తున్న నిధుల సమస్య..
రాష్ట్ర పరిమితిలో 99 శాతం మేర అప్పులు కూడా తీసుకోవడంతో.. తదుపరి సంక్షేమ పథకాల అమలుకు నిధుల సమస్య వేధిస్తోంది(ap govt facing financial difficulties news). ఇందులో భాగంగానే నవరత్నాల్లో కీలకమైన.. అమ్మఒడి పథకం(amma vodi scheme news) అమలును 2022 జూన్ కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. గడిచిన ఐదు నెలల కాలంలో పన్నుల పెంపు కారణంగా 15,361 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చినా.. మొదటి ఐదు నెలల్లోనే 99 శాతం మేర రుణాలు తీసేసుకోవటంతో తదుపరి అర్ధ సంవత్సరం పరిస్థితి ఏమిటన్నది అయోమయంగా మారింది.
గడిచిన 5 నెలల కాలంలో ఏపీ ఆర్ధిక పరిస్థితిపై కాగ్ నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర పన్నుల ద్వారా 53,159 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు మాత్రం 90,071 కోట్లుకు చేరుకుంది. ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరం 36,912 కోట్లకు చేరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,77,106 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అయితే.. తొలి ఐదు నెలల్లో 53 వేల కోట్ల రూపాయలు మాత్రమే రావడంతో ప్రభుత్వ ఖజనా ఇబ్బందుల్లో పడింది. గత ఏడాదితో పోలిస్తే అదనంగా 15,361 కోట్ల ఆదాయం రావటం ఆర్థిక శాఖ ఇబ్బందులను కాసింత తగ్గించాయి.