ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అంత్యక్రియలయ్యాక వచ్చిన నివేదిక..కరోనా పాజిటివ్ నిర్ధరణ

By

Published : Jun 24, 2020, 4:29 PM IST

అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. అయితే నివేదిక రాకముందే మృతదేహాన్ని బంధువులకు అప్పగించటంతో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఇప్పుడు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని అధికారులు క్వారంటైన్​కు తరలిస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది.

after completion of funreal process the dead body of a lady tested corona positive  in guntur dst sathenapalli
after completion of funreal process the dead body of a lady tested corona positive in guntur dst sathenapalli

గుంటూరు జల్లా సత్తెనపల్లిలో ఇటీవల మరణించిన వృద్ధురాలికి కరోనా నిర్ధరణ అయింది. సత్తెనపల్లి బోయ కాలనీకి చెందిన వృద్ధురాలు అనారోగ్యానికి గురికాగా గుంటూరు జీజీహెచ్​కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. నివేదిక రాకముందే మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ రోజు వచ్చిన నివేదికలో వృద్ధురాలికి పాజిటివ్ వచ్చింది. దీంతో అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఆందోళన మొదలైంది.

మొత్తం 15 మందిని క్వారంటెన్​కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె నివాసం వద్ద ప్రాంతాన్ని మున్సిపల్ అధికారులు కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. సత్తెనపల్లి పరిధిలో గతంలో మృతదేహాల విషయంలో రెండుసార్లు పాజిటివ్​గా తేలింది. ఆ సందర్భాల్లో అంత్యక్రియలకు హాజరైన 10మంది వరకూ కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు ఎంతమందికి వైరస్ వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details