గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో భోజనానికి పిలవలేదని ఓ వ్యక్తి తన స్నేహితుడిని కత్తితో పొడిచాడు. మండలంలోని గరికపాడుకు చెందిన మొక్కపాటి రామారావు... అదే గ్రామానికి చెందిన పసుపులేటి రత్నం స్నేహితులు. వీరు రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ఇటీవల రామారావు తల్లి చనిపోయింది. ఆమె పెద్దకర్మ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. కానీ.. రామారావు.. రత్నంను పిలవలేదు. అతను ఫోన్లో తిట్టడంతో... బండ్లమోటు పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేశాడు రామారావు.
ఈ క్రమంలోనే బజారులో కూర్చున్న రామారావుపై రత్నం కత్తితో దాడి చేసి పొట్ట, వీపుపైన పొడిచాడు. బాధితుడిని స్థానికులు వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం రామారావును గుంటూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.