అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల పేరిట వృక్షాలపై వేటు పడుతోంది. అధికారికంగా, అనుమతులతోనే ఏటా లక్షన్నరకు పైగా చెట్లు నేలకొరుగుతున్నాయి. ఇలా గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్లో 4,95,269 చెట్లను నరికేశారు. విద్యుత్తు లైన్లు, రహదారులు, గనుల తవ్వకాలు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇవి బలైపోయాయి. ఇంత పెద్దస్థాయిలో తరువుల నరికివేతకు అనుమతిచ్చిన ప్రభుత్వాలు.. వాటి స్థానంలో మొక్కలు నాటడం, పచ్చదనం పెంపుపై శ్రద్ధ చూపట్లేదు.
- ఏపీలోనే 6.45 శాతం
- 2016-19 మధ్య దేశవ్యాప్తంగా 76,72,337 చెట్ల నరికివేతకు అనుమతి లభించగా.. అందులో ఏపీలోనే 6.45% ఉన్నాయి. అత్యధికంగా చెట్లు నరికేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరోస్థానంలో ఉంది. అనుమతులు లేకుండా నరికేసినవి ఇంకా చాలా ఉన్నాయి.
- అటవీ భూమిని ఇతర అవసరాలకు వినియోగించాలంటే రాష్ట్రస్థాయిలో నోడల్ అధికారికి ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపించాలి. పరిశీలన అనంతరం అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అనుమతి ఇస్తారు.
గత మూడేళ్లలో ఈ రాష్ట్రాల్లోనే అత్యధికంగా చెట్లు నరికివేతకు గురయ్యాయి(ఆధారం: కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ గణాంకాలు)
రాష్ట్రం | నరికివేతకు గురైన చెట్లు |
తెలంగాణ | 12,12,753 |
మహారాష్ట్ర | 10,73,484 |
మధ్యప్రదేశ్ | 9,54,767 |
ఛత్తీస్గఢ్ | 6,65,132 |
ఒడిశా | 6,58,465 |
ఆంధ్రప్రదేశ్ | 4,95,269 |
ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తే..