ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 వేల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ - కూరగాయలు పంచిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వార్తలు

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కోరారు. నాగుల్లంకలో దాతలు ఇచ్చిన కూరగాయలను ప్రజలకు పంపిణీ చేశారు.

vegetables distributed in naagullanka east godavari district
కూరగాయలు పంచుతున్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

By

Published : Apr 26, 2020, 2:19 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం నాగుల్లంకలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చేతుల మీదుగా దాతలు కూరగాయలు పంపిణీ చేశారు. గ్రామంలోని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి... తన మిత్రబృందంతో కలిసి సుమారు 2 వేల కుటుంబాలకు కూరగాయలు సమకూర్చగా... ఎమ్మెల్యే వాటిని ప్రజలకు అందజేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details