తూర్పుగోదావరి జిల్లా తుని కమిషనర్గా పనిచేస్తున్న ప్రసాదరాజు పట్టణ పరిశుభ్రత కోసం తనవంతు కృషిచేస్తున్నారు. స్వచ్ఛ భారత్ ఆదర్శంతో తుని పట్టణాన్ని చెత్తరహితంగా మార్చేందుకు ప్రణాళికలు వేసి వాటిని పక్కాగా అమలుచేస్తున్నారు. తడిచెత్తను, పొడిచెత్తను వేరుచేసి సేంద్రీయ ఎరువులు తయారుచేయిస్తున్నారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన ఇంట్లోనే వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు పెంచుతూ.. వాటికి కావాల్సిన ఎరువులను స్వయంగా తయారుచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
'స్వచ్ఛ తుని' కోసం పక్కా ప్రణాళికలు
స్వచ్ఛ భారత్ ఆదర్శంతో తుని పట్టణాన్ని చెత్తరహితంగా మార్చేందుకు పట్టణ కమిషనర్ పక్కా ప్రణాళికలను అమలుచేస్తున్నారు. తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరుగా సేకరిస్తూ ఎరువులు తయారుచేస్తున్నారు. ఈ విధానంతో పట్ఠణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తున్నారు.
స్వచ్ఛ తుని