అన్నవరం దేవస్థానంలో లోక కళ్యాణార్ధం డిసెంబర్ 16 నుంచి 25 వరకు కోటి తులసి పత్రి పూజ నిర్వహించనున్నారు. ఈ పూజకు కావాల్సిన తులసి కోసం తుని మండలం తలుపులమ్మలోవ దేవస్థానం ఆధ్వర్యంలో భారీగా తులసి వనం పెంచడానికి నిర్ణయించారు. ఇందుకోసం వెలమ కొత్తూరు గ్రామంలో దేవస్థానానికి చెందిన రెండు ఎకరాల స్థలంలో వీటిని పెంచేందుకు ఈవో రమేష్ బాబు విత్తనాలు చల్లారు.
తులసి వనం కోసం విత్తనాలు చల్లిన అన్నవరం దేవస్థానం ఈవో
అన్నవరం దేవస్థానంలో డిసెంబరులో జరిగే కోటి తులసి పత్రిపూజకు... కావాల్సిన తులసి పత్రి కోసం ఆలయ ఈవో రమేష్ బాబు వెలమ కొత్తూరు గ్రామంలో విత్తనాలు చల్లారు.
తులసి విత్తనాలు చల్లిన అన్నవరం ఈవో