ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 26, 2020, 5:36 PM IST

ETV Bharat / state

సారా వ్యాపారాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

సారా నిర్మూలనకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన అక్రమ అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గ్రామస్థులే సారా విక్రయాలపై తిరగబడి.. సారాను ధ్వంసం చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో చోటు చేసుకుంది

east godavari district
సారా వ్యాపారాన్ని అడ్డుకున్న గ్రామాస్థులు

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో అక్రమ సారా వ్యాపారం జోరుగా కొనసాగుతుండటంతో గ్రామస్థులు తిరగబడ్డారు. స్థానిక మాజీ సర్పంచ్ సహకారంతో వాలంటీర్స్ ఆధ్వర్యంలో గ్రామస్థులు సారా పట్టుకున్నారు. గ్రామంలో వివిధ ప్రాంతాలలో దాచిన వంద లీటర్ల సారాను పారబోశారు. అక్రమ అమ్మకాలు ఆపకుంటే అధికారులకు సమాచారం ఇచ్చి పట్టిస్తామని వ్యాపారస్తులను గ్రామస్థులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details