మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో తెలుగుదేశం నాయకులు నిరసన చేపట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
మహిళలపై దాడులను అరికట్టాలి: తెదేపా
వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయని తెదేపా నేతలు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మహిళపై దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు
tdp protest against attacks on women at amalapuram