ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 20, 2020, 3:56 PM IST

ETV Bharat / state

అమరావతికి మద్దతుగా రామవరంలో రహదారి దిగ్బంధం

అమరావతికి మద్దతుగా కిర్లంపూడి మండలంలో జిల్లా పరిషత్​ మాజీ ఛైర్మన్​ జ్యోతుల నవీన్ కుమార్ నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున టైర్లు దగ్ధం చేయటంతో పోలీసులు నవీన్​ను అదుపులోకి తీసుకుని జగ్గంపేట పోలీస్​ స్టేషన్​కి తరలించారు.

tdp leaders protest at ramavaram in east godavari district
అమరావతికి మద్దతుగా రామవరంలో రహదారి దిగ్బంధం

అమరావతికి మద్దతుగా రామవరంలో రహదారి దిగ్బంధం

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా శ్రేణులు నిరసన చేపట్టారు. జిల్లా పరిషత్​ మాజీ ఛైర్మన్​ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రామవరం వద్ద జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున టైర్లు దగ్దం చేశారు. అనంతరం నవీన్ రోడ్డుపై బైఠాయించి రాజధానికి మద్దతుగా నినాదాలు చేశారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల త్యాగాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి అవమానిస్తున్నారంటూ విమర్శించారు. రహదారి దిగ్బంధంతో పోలీసులు నవీన్​ను అదుపులోకి తీసుకుని జగ్గంపేట పోలీస్​ స్టేషన్​కి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details