ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా తూర్పు గోదావరి జిల్లాలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జేఏసీ జిల్లా కన్వీనర్ తాటిపాక మధు తెలిపారు.
నిరసనగా..
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యంగ హక్కులను నాశనం చేస్తున్నందుకు నిరసనగా ఆదివారం ఉదయం అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.