తూర్పుగోదావరి జిల్లా తునిలో విద్యార్థులకు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ మన్యం నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న, చిన్న ప్యాకెట్లు చేసి విద్యార్థులకు 500, రూ 1,000 రూపాయలకు ముఠా సభ్యులు ఈ ప్యాకెట్లు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి 4 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతో జిల్లా ఎస్పీ ఆదేశానుసారం పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా.. నలుగురు అరెస్ట్
విద్యార్థులకు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్ చేసి.. 4 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి ముఠా అరెస్ట్