ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 26, 2021, 7:25 PM IST

ETV Bharat / state

విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠా.. నలుగురు అరెస్ట్

విద్యార్థులకు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్ చేసి.. 4 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

arrest
గంజాయి ముఠా అరెస్ట్

గంజాయి ముఠా అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా తునిలో విద్యార్థులకు గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ మన్యం నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న, చిన్న ప్యాకెట్లు చేసి విద్యార్థులకు 500, రూ 1,000 రూపాయలకు ముఠా సభ్యులు ఈ ప్యాకెట్లు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి 4 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామంతో జిల్లా ఎస్పీ ఆదేశానుసారం పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details