ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 23, 2020, 3:16 PM IST

ETV Bharat / state

యానాంలో ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు

యానాం వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో ఎంతో ఉత్కంఠగా సాగిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. పుదుచ్చేరి క్రీడా శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు... డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మీనా.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ విజేతలకు​ బహుమతులను ప్రధానం చేశారు.

యానాంలో ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు
యానాంలో ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు

యానాంలో ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు

యానాం వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. బాలుర విభాగంలో ఫైనల్ మ్యాచ్​లో చండీగఢ్ - కేరళ జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు రెండు సెట్స్ విజయం సాధించాయి. నిర్ణయాత్మకమైన ఐదో సెట్లలో చండీగఢ్​పై రెండు పాయింట్ల తేడాతో కేరళ జట్టు గెలుపొందింది. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. పుదుచ్చేరి క్రీడా శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు.. డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మీనా.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ విజేతలకు బహుమతులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details