ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 30, 2020, 10:58 PM IST

ETV Bharat / state

జగ్గంపేట నుంచి తెదేపా 'చలో అమరావతి'

రాజధాని రైతులకు మద్దతుగా రేపు జగ్గంపేట నుంచి చలో అమరావతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెదేపా నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. తెదేపా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నెహ్రూ పిలుపునిచ్చారు.

jyothula nehru on chalo amaravathi
జ్యోతుల నెహ్రూ

రాజధాని రైతులకు మద్దతుగా రేపు 'చలో అమరావతి' కార్యక్రమం చేపట్టనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటలకు జగ్గంపేట మండలం ఇర్రిపాకలో వారి స్వగృహం నుంచి జ్యోతుల నవీన్ తో కలిసి అమరావతి వెళ్లనున్నట్లు నెహ్రూ ప్రకటించారు. అరెస్టైన బీసీ దళిత రైతులకు మద్దతుగా అమరావతి వెళ్లనున్నట్లు తెలిపారు. తెదేపా ముఖ్య నేతలు చలో అమరావతి కార్యక్రమంలో పాల్లొనాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details