తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామంలో యువకులు వెయ్యి కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి నాలుగు గుడ్లను పంచిపెట్టారు. ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు జ్యోతి వెలిగింపు కార్యక్రమం, కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ద్వారపూడి బ్రహ్మానందం, ఆకేటి రామకృష్ణ , గంధం ఈశ్వరరావు, కర్రి కార్తీక్ పాల్గొన్నారు.
వెయ్యి కుటుంబాలకు కూరగాయల పంపిణీ
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన తరుణంలో కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోని బస్వా వీరబాబు ఆధ్వర్యంలో యువత కూరగాయలను పంచారు. కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై వారు అవగాహన కల్పించారు.
వెయ్యి కుటుంబాలకు కూరగాయల పంపిణీ
TAGGED:
ముక్కొలులో కూరగాయల పంపిణీ