తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో అధికారులు మూడు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఇటీవల గంగవరం డిప్యూటీ తహసీల్దార్కు కరోనా పాజిటివ్ రావటంతో ఈ నెల 2న కార్యాలయంలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగుల వరకు కొవిడ్ పరీక్షలను చేశారు. వీరిలో 10 మంది ఉద్యోగులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎంపీడీవో లక్ష్మిరెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ కళ్యాణి, డివిజనల్ పంచాయతీ అధికారి హరినాథ్ బాబు ఆయా వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.
రంపచోడవరంలో పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అధికారులు మూడు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వారిలో పదిమందికి పాజిటివ్ వచ్చింది.
corona cases increasing in east godavari dst rampachodavarm
TAGGED:
rampachodavarm corona cases