ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రంపచోడవరంలో పెరుగుతున్న కంటైన్మెంట్ జోన్లు

By

Published : Jul 8, 2020, 8:11 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అధికారులు మూడు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వారిలో పదిమందికి పాజిటివ్ వచ్చింది.

corona cases increasing  in east godavari dst rampachodavarm
corona cases increasing in east godavari dst rampachodavarm

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో అధికారులు మూడు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. ఇటీవల గంగవరం డిప్యూటీ తహసీల్దార్​కు కరోనా పాజిటివ్ రావటంతో ఈ నెల 2న కార్యాలయంలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగుల వరకు కొవిడ్ పరీక్షలను చేశారు. వీరిలో 10 మంది ఉద్యోగులకు పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఎంపీడీవో లక్ష్మిరెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ కళ్యాణి, డివిజనల్ పంచాయతీ అధికారి హరినాథ్​ బాబు ఆయా వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details