తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం దొరగారి మైదానంలో కోడిపందాలు గుండాటలు నిర్వహిస్తుండదగా ఘర్షణ ఏర్పడింది.
కోడి కత్తితో దాడి.. ఒకరికి గాయాలు
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం దొరగారి మైదానంలో నిర్వహించిన కోడి పందాలు, గుండాటల్లో వివాదం రావడంతో కోడి కత్తితో ఒకరిపై దాడి జరిగింది. గాయపడిన రమణ అనే వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.
కోడి కత్తితో దాడి
ఆటలో స్వల్ప వివాదం రావడంతో కోడికత్తితో జగపతినగరం గ్రామానికి చెందిన రమణ అనే వ్యక్తి పై అదేగ్రామానికి చెందిన మణికంఠ అనే వ్యక్తి దాడి చేశాడు. దాడిలో గాయపడిన రమణను ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. కోడిపందాలు జూదం యధేచ్చగా నిర్వహించడంతో పలువురు స్థానికులు విమర్శలు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కోడిపందేల ట్రాఫిక్ జాం.. ఇరుక్కుపోయిన అంబులెన్స్