ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 13, 2021, 9:15 PM IST

ETV Bharat / state

కోడి కత్తితో దాడి.. ఒకరికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం దొరగారి మైదానంలో నిర్వహించిన కోడి పందాలు, గుండాటల్లో వివాదం రావడంతో కోడి కత్తితో ఒకరిపై దాడి జరిగింది. గాయపడిన రమణ అనే వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.

east godavari
కోడి కత్తితో దాడి

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం దొరగారి మైదానంలో కోడిపందాలు గుండాటలు నిర్వహిస్తుండదగా ఘర్షణ ఏర్పడింది.

ఆటలో స్వల్ప వివాదం రావడంతో కోడికత్తితో జగపతినగరం గ్రామానికి చెందిన రమణ అనే వ్యక్తి పై అదేగ్రామానికి చెందిన మణికంఠ అనే వ్యక్తి దాడి చేశాడు. దాడిలో గాయపడిన రమణను ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. కోడిపందాలు జూదం యధేచ్చగా నిర్వహించడంతో పలువురు స్థానికులు విమర్శలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:కోడిపందేల ట్రాఫిక్​ జాం.. ఇరుక్కుపోయిన అంబులెన్స్​

ABOUT THE AUTHOR

...view details