ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 3, 2021, 8:50 AM IST

ETV Bharat / state

అమలాపురంలో ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి

కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కొవిడ్ కేసులే ఇందుకు నిదర్శనం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం ఒక్కరోజే 10 మంది మృతి చెందారు.

corona
corona

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. పెరుగుతున్న కేసులు, మరణాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని రెండు ఆసుపత్రుల్లో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఒక్కరోజే ఇక్కడ 10 మంది కరోనాతో మృతి చెందారు. అమలాపురం కిమ్స్​లో 9, అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలకు అమలాపురం మున్సిపల్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించామని మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details