తూర్పు గోదావరిజిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట... 104 కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనిట్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకుల మద్ధతుతో జరిగిన ఈ ధర్నాలో 104 ఉద్యోగులకు ల్యాబ్టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, నర్సులు, వాచ్మెన్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా మంజూరైన 104 వాహనాల్లో పాత వారిని తొలగించడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రే నేరుగా జోక్యం చేసుకుని తమ సమస్యలపై... గతంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని కోరారు.