ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 14, 2020, 12:57 AM IST

ETV Bharat / state

యజమానులు ఊరికి వెళ్తే... అతను ఇంటిని ఆక్రమించేశాడు!

12 సంవత్సరాల తరువాత స్వగ్రామానికి తిరిగివచ్చిన ఓ కుటుంబానికి ఊహించని పరిణామం ఎదురైంది. తమ పొలాన్ని కొన్న వ్యక్తి తమ ఇంటిని ఆక్రమించాడని బాధితులు తెలిపారు. సొంత ఇంట్లోకి తమను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

the house is occupied when the owners  went to city
the house is occupied when the owners went to city

యజమానులు ఊరికి వెళ్తే... అతను ఇంటిని ఆక్రమించేశాడు!

తమ ఇంటిని ఓ వ్యక్తి ఆక్రమించాడని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మల్లయ్యపల్లికి చెందిన ఓ కుటుంబం ఆరోపించింది. తమ సొంత ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

12 సంవత్సరాల క్రితం మా పొలాన్ని అమ్మేసి పిల్లల చదువు కోసం బెంగళూరు వెళ్లపోయాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి సంబంధించి కరెంట్, ఇంటి పన్నులు, వాటర్ బిల్లులు క్రమం తప్పకుండా కడుతున్నాం. నెల క్రితం మా ఇంటికి వస్తే పొలం కొన్న వ్యక్తి అడ్డుకున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశాం. దారికి అడ్డంగా కంచె ఏర్పాటు చేశారు. గేటుకు తాళం వేసి వాచ్ మెన్ ద్వారా దాడికి ప్రయత్నిస్తున్నారు. భూమి కొన్న వ్యక్తి ఇప్పటికీ పూర్తి నగదు చెల్లించలేదు. ఇంటిని కూడా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సంబంధిత అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి- సునీత, భాధితురాలు

ఇదీ చదవండి
ప్రాణం తీసిన పందెం.. మద్యం పోటీలో వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details