ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 27, 2020, 3:11 AM IST

ETV Bharat / state

చిత్తూరులో 498 కేజీల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

లారీలో అక్రమంగా తరలిస్తున్న 498 కేజీల ఎర్రచందనం దుంగలను చిత్తూరు జిల్లా పుంగనూరులో అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీని వదిలేసి డ్రైవర్ పరారు కాగా..వాహనాన్ని సీజ్ చేశారు.

చిత్తూరులో 498 కేజీల ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరులో 498 కేజీల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు జిల్లా పుంగనూరులో అక్రమంగా తరలిస్తున్న 498 కేజీల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదుం మండలం కలకటవారిపల్లి వద్ద అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్​తో ఉన్న ఓ లారీ ఆగకుండా వెళ్ళిపోయింది. అటవీశాఖ అధికారులు లారీని వెంబడించగా..సదుం బ్రిడ్జి వద్ద లారీని వదిలి నిందితుడు పారిపోయాడు. లారీ నుంచి 498 కేజీల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details