భాజపా, జనసేన స్నేహం.. రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు తిరుపతి చేరుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలిస్తోందని విమర్శించారు. ఈ తీరును ఎండగట్టేందుకే జనసేన, భాజపా కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అమరావతి రైతులకు తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలు అమలయ్యేలా తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు.
అమరావతి రైతులకు అండగా భాజపా - జనసేన: నాదెండ్ల - latest news for janasena party and bjp in telugu
'రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక పరిపాలనను వ్యతిరేకించడానికే భాజాపా - జనసేన కలిసి పని చేసేందుకు నిర్ణయించాయి' అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి రైతులకు తమ 2 పార్టీలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

రేణిగుంట విమానశ్రయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జనసేన కార్యకర్త నాదెండ్ల మనోహర్
విలేకరులతో మాట్లాడుతున్న జనసేన నేత నాదెండ్ల మనోహర్