ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 31, 2020, 7:15 PM IST

ETV Bharat / state

ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలపై కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో సత్యాగ్రహ దీక్షను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శైలజానాథ్.. తక్షణమే కేంద్ర వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

congress leader
congress leader

సొంత ప్రయోజనాల కోసం రైతులను కేంద్రం వద్ద సీఎం జగన్ తాకట్టు పెట్టారని ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శైలజానాథ్.. తక్షణమే కేంద్ర వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోటార్లకు విద్యుత్ మీటర్లు అమర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడిన ఏపీసీసీ అధ్యక్షుడు.. రైతుల కోపానికి వైకాపా బలికాక తప్పదన్నారు. రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వ నిర్ణయాలకు అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ తరపున అడ్డుపడతామని శైలజానాథ్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details