ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 28, 2020, 7:15 AM IST

ETV Bharat / state

తమిళ సరి...హద్దు గోడలు కూలాయి

చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా చొరవతో అంతర్రాష్ట్ర సరిహద్దులో నిర్మించిన గోడను జిల్లా అధికారులు కూల్చివేయించారు.

Chittoor district officials who demolished the walls built along the Tamil Nadu border
చిత్తూరు జిల్లాలో అంతరాష్ట్ర సరిహద్దు గోడ తొలగింపు

ఏపీ, తమిళనాడు సరిహద్దులో నిర్మించిన గోడను... చిత్తూరు జిల్లా అధికారులు కూల్చివేయించారు. పలమనేరు నుంచి రాకపోకలను నియంత్రించేలా... తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తం సమీపంలోని సైనిగుంట వద్ద... పొరుగు రాష్ట్రం అడ్డుగోడ నిర్మించింది. ఈ విషయంపై స్పందించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా.... రైతుల సమస్యలపై తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కలెక్టర్ తో చర్చించారు. సానుకూల స్పందన రావడంతో... గోడ తొలగించి రైతుల రాకపోకలు పునరుద్ధరించాలని.... స్థానిక అధికారులను ఆదేశించారు. గుడియాత్తం తహసీల్దార్ తమ సిబ్బందితో కలిసి... గోడను కూల్చివేయించారు.

ABOUT THE AUTHOR

...view details