ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 27, 2020, 4:15 PM IST

ETV Bharat / state

వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్యర్యంలో 15 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు.

Agricultural Market
Agricultural Market

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వ్యవసాయ మార్కెట్ సంఘం నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వయ్యాల కృష్ణారెడ్డి అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్నారు. 15 మంది డైరెక్టర్లుగా ప్రమాణం చేశారు.

రైతుల శ్రేయస్సు కోసం వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే కాక.. నెలకొకసారి వ్యవసాయ అధికారులు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details