ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా సమీక్షలు  2 రోజులపాటు వాయిదా

ఫొని తుపాను కారణంగా... తెదేపా సమీక్షలు 2 రోజుల పాటు వాయిదా పడ్డాయి. వీటిని ఈ నెల 4 నుంచి 22 వరకు నిర్వహించనున్నామని తెదేపా ప్రకటించింది.

By

Published : May 2, 2019, 7:30 AM IST

తెదేపా సమీక్షలు వాయిదా

తెదేపా సమీక్షలు వాయిదా

ఫొని తుపాను నేపథ్యంలో ఎన్నికల సమీక్షలను 2 రోజుల పాటు తెదేపా వాయిదా వేసింది. నేటి నుంచి సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు తొలుత నిర్ణయించారు. తొలిరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు పెట్టారు. వీటిని ఈ నెల 4 నుంచి ప్రారంభిస్తారు. 4 న అరకు, రాజమండ్రి పార్లమెంటు స్థానాల సమీక్ష జరుగుతుంది. 5 న విరామం ఇచ్చి 6 న కాకినాడ, అమలాపురం పార్లమెంటు స్థానాలపై సమావేశం నిర్వహిస్తారు. 22 వరకు ఈ సమీక్షలు జరగనున్నాయి. రేపు సీబీఎన్ ఆర్మీ సభ్యులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details