ఇళ్ల నిర్మాణ పనులను 3 దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశలో 40, రెండో దశ కింద 36 ఇళ్లు సిద్ధం చేస్తారు. 400 చదరపు అడుగుల్లో నిర్మించనున్న ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 6 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రయత్నం 116 కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపనుంది.
'తెలుగు' ఇళ్లకు శంకుస్థాపన
కేరళ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఈనాడు చేపట్టిన గృహ నిర్మాణ క్రతువులో మరో ముందడుగు పడింది. కుటుంబశ్రీ మిషన్తో ఒప్పందం కుదిరిన 24 గంటల్లోనే నివాసాల నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పునాదిరాయి కార్యక్రమంలో ఈనాడు ప్రతినిధులు, మిషన్ సభ్యులు పాల్గొన్నారు.
'తెలుగు' ఇళ్లకు శంకుస్థాపన
7.77 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ గృహాల నిర్మాణం... ఆరు నుంచి ఏడు నెలల్లో పూర్తి చేస్తామని ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ వెల్లడించారు.భూమి పూజకు మార్గదర్శి గ్రూప్ ప్రెసిడెంట్ రాజాజీతోపాటు కుటుంబ శ్రీ మిషన్ ప్రతినిధులు హాజరయ్యారు.
Last Updated : Mar 2, 2019, 6:47 PM IST