ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసమ్మతి సద్దుమణిగింది

గుడివాడ, అవనిగడ్డ సీట్ల కేటాయింపుపై కినుకుగా ఉన్న నేతలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు కేటాయిస్తామన్నసీఎం హామీతో అసమ్మతి వర్గం సద్దుమణిగి ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారు.

By

Published : Mar 11, 2019, 9:14 PM IST

దేవినేని అవినాష్

గుడివాడ, అవనిగడ్డ తెదేపా నేతల అసమ్మతి సద్దుమణిగింది. గుడివాడ శాసనసభ స్థానాన్ని దేవినేని అవినాష్​కు కేటాయిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ సీటు కోసం ప్రయత్నించిన రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. మరోనేత ఎలవర్తి శ్రీనివాస్​కు కార్పొరేషన్ పదవి దక్కే అవకాశం ఉంది. మరోవైపు అవనిగడ్డపైనా అసమ్మతి పంచాయితీ ముగిసింది. ఆ సీటును మండలి బుద్ధప్రసాద్ కేటాయిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. విభేదాలు వీడి నేతల విజయానికి కృషి చేయాలని అసమ్మతి వర్గానికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details