ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం ఛాంబర్​లో జగన్ ప్రత్యేక పూజలు

ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీకి వచ్చిన జగన్... తనకు కేటాయించిన ఛాంబర్​కు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనం పొందారు.

By

Published : Jun 13, 2019, 12:20 AM IST

జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి... నేరుగా తనకు కేటాయించిన ఛాంబర్​కు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం... ఛాంబర్​లో కూర్చుకున్నారు. సీఎంకు ఉపముఖ్యమంత్రులు ఆళ్లనాని, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. శాసనసభ అధికారులు ముఖ్యమంత్రి జగన్​ను ఛాంబర్​కు తోడ్కోని వెళ్లారు. బుధవారం ఉదవారం 10గంటల 50నిమిషాలకు అసెంబ్లీకి చేరుకున్న జగన్... పూజ ముగిసిన అనంతరం 11గంటల 05నిమిషాలకు సభలోకి ప్రవేశించారు. శాసనసభలో జాతీయ గీతాలాపన అనంతరం... ప్రోటెం స్పీకర్ శంబంగి చినఅప్పలనాయుడు నోటిఫికేషన్ చదివి... సీఎం జగన్​తో ప్రమాణం చేయించారు.

ABOUT THE AUTHOR

...view details