ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిర్యానీలో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య

తెలంగాణ ఖమ్మం జిల్లా కేంద్రంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం వల్ల నగరంలో  విషాదం ఛాయలు అలుముకున్నాయి. బిర్యానీలో పురుగుల మందు కలుపుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

By

Published : Jun 28, 2019, 4:29 PM IST

బిర్యానీలో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య

తెలంగాణ ఖమ్మంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దంపతులు రాంప్రసాద్‌, సుచిత్ర సహా ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతకు ముందు రోజు కలిసిమెలిసి ఉన్నవారు విగత జీవులుగా మారడం వల్ల స్థానికులు, బంధువులు కన్నీటిపర్యంతం అయ్యారు.

ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన రాంప్రసాద్​ ఖమ్మంలోని గ్రానైట్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెల్లో పెద్దమ్మాయి రుచిత పదోతరగతి.... చిన్నమ్మాయి జాహ్నవి రెండో తరగతి చదువుతోంది. గురువారం రాత్రి ఓ వేడుకకు కుటుంబమంతా వెళ్లాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల హాజరుకాలేదు. బిర్యానీలో పురుగుల మందు కలుపుకొని తిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల వరకు మేల్కొనే ఉన్నారని స్థానికులు చెప్తున్నారు.

ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్లను విచారిస్తున్నారు.

బిర్యానీలో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య

ఇవీ చూడండి:'తండ్రి అనుమతిస్తే.... కొడుకు నోటీసులా?'

ABOUT THE AUTHOR

...view details