ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇకపై... రూ.5 లక్షల ఆదాయమున్నా ఆరోగ్య శ్రీ

రాష్ట్ర తొలి బడ్జెట్​లో ఆరోగ్య శ్రీకి అధిక ప్రాధాన్యం కల్పించారు. ఈ పథకానికి బడ్జెట్​లో రూ.1,740 కోట్లు కేటాయించారు. ఇకనుంచి... వార్షిక ఆదాయం రూ.5 లక్షలున్న కుటుంబాలకు సైతం ఆరోగ్య శ్రీ వర్తించనుంది.

By

Published : Jul 12, 2019, 2:20 PM IST

Updated : Jul 12, 2019, 5:04 PM IST

ఆరోగ్య శ్రీ కి మునుపటి వెలుగు

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్


ఆరోగ్య శ్రీకి వర్తింపులు ఇలా...

  • వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు(నెలకు రూ.40,000 ఆదాయం కలిగిన కుటుంబాలకు) వర్తిస్తుంది.
  • వైద్య ఖర్చులు రూ 1,000లు మించిన అన్ని కేసులు.
  • చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితి లేకుండా అన్ని కేసులకు చికిత్సను అందించడం, సరిహద్దు జిల్లాలలో ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్రానికి సరిహద్దులైన బెంగళూరు, హైదరాబాద్​, చెన్నై వంటి నగరాల్లోని మంచి ఆస్పత్రులను ప్రభుత్వ జాబితాలో చేరుస్తారు.
  • అన్ని రకాల రోగాలు, సర్జరీలను ఆరోగ్యశ్రీ కింద వర్తింప జేస్తారు. మరో 5 లక్షల మందికి వర్తించనుంది.


'108' కి 179.76 కోట్లు..
రాష్ట్రంలో ప్రతి ప్రదేశానికి, ప్రతి మండలానికి ఒక 108 ఉండటమే ప్రభుత్వ ధ్యేయమని బుగ్గన వెల్లడించారు. మొత్తం 143.38 కోట్లతో కార్యక్రమ సంబంధ వ్యయంతో 432 ఆదనపు వాహనాలను సేకరించి, సర్వీసు నాణ్యతను మెరుగు పరుస్తారు.


'104' కి 179.76 కోట్లు...

  • నూతనంగా 676 ఆదనపు 104 వాహనాలు కొనుగోలు చేస్తారు. సర్వీసు నాణ్యతను మెరుగు పరచడానికి 179.76 కోట్లు కేటాయించింది.
  • ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి 1,500 కోట్లు
  • రెండు సంవత్సరాల వ్యవధిలో ఉత్తమ కార్పొరేట్ ఆస్పత్రులతో సమానంగా ప్రభుత్వ ఆస్పత్రులను మార్చనున్నారు.
  • దీని కోసం 1,500 కోట్లు కేటాయించారు.

ఇదీ చదవండీ:జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన

Last Updated : Jul 12, 2019, 5:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details